హైదరాబాద్: కేసీఆర్ ది కుటుంబ పాలన అంటూ పదే పదే విమర్శలు చేస్తున్న టి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యాలపై మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ ది కుటంబ పాలన అంటూ గొంతు చించుకుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. కుటుంబ పాలన నుంచి గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. కుటుంబ పాలనపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో కుటుంబానికి ఒక్కరికే సీటు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. అలా చేస్తే సగం మీసం తీసేసి తిరుగుతానని ఉత్తమ్‌కు దానం నాగేందర్ ఛాలెంజ్‌ విసిరారు.