వరంగల్‌: యువనేత టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావును రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలంటూ తెలంగాణ కార్యకర్తలు సోమవారం నాడు మేడారంలో సమ్మక్క-సారలమ్మను మొక్కుకున్నారు. సుమారు వెయ్యి మంది యువకులు భక్తితో ర్యాలీగా మేడారం చేరుకొని వనదేవతల గద్దెల వద్ద మొక్కు చెల్లించారు. 


అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ప్రపంచదేశాలలోని పారిశ్రామిక వేత్తలతో సంబంధాలు కలిగి ఉండటంతో పాటు, పార్టీని క్రమశిక్షణతో ముందుకు నడిపించగల సత్తా కేటీఆర్‌కు ఉందన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని ఏకతాటిపై నడిపించి పూర్తి విజయాన్ని చేకూర్చినందుకు ఆయనను  కార్యకర్తలు అభినందించారు. ఈ మొక్కుబడిలో భూపాలపల్లి నియోజకవర్గంలోని సుమారు 15 గ్రామాలకు చెందిన యువకులు పాల్గొన్నారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..