గిఫ్ట్‌ ఏ స్మైల్‌ (Gift A Smile) కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి (Marri Janardhan Reddy) భాగస్వామి అయ్యారు. తన వంతుగా రెండు అంబులెన్సులు అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రెండు అంబులెన్సుల కొనుగోలు కోసం రూ.41 లక్షల రూపాయల చెక్కును మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. సేవా కార్యక్రమంలో తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిని కేటీఆర్ అభినందించారు. Actress Sravani Funeral: నటి శ్రావణి అంత్యక్రియలు పూర్తి..