హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఎంసెట్-2019 పరీక్ష ఫలితాలను కొద్దిసేపటి క్రితమే కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్ క్యాంపస్‌లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. టీఎస్‌ఎంసెట్-2019 అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 


జేఎన్టీయూహెచ్‌ వీసీ వేణుగోపాల్‌ రెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్య సమక్షంలో టీఎం ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి.