సంగారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు-టాటాఏస్‌ వాహనాలు ఢీకొన్న ఘటనలో టాటా ఏస్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు పులకల్‌ మండలం చౌటకూర్‌ వాసులుగా గుర్తించారు. ప్రమాద గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఆర్టీసి కార్మికులు సమ్మెలో ఉన్న నేపథ్యంలో ఆర్టీసి యాజమాన్యం తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లను నియమించుకుని వీలైనంత మేరలో ప్రయాణికులకు సేవలు అందించే ప్రయత్నం చేస్తోంది. అయితే, అదే సమయంలో రాష్ట్రం నలుమూలలా కొంతమంది తాత్కాలిక డ్రైవర్లు నడుపుతున్న ఆర్టీసి బస్సులు ప్రమాదాలబారిన పడుతుండటం తమను భయాందోళనలకు గురిచేస్తోందని ప్రయాణికులను చెబుతున్నారు.