Pakistan Accident: పాకిస్థాన్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో 19 మంది మృతి చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇస్లామాబాద్ నుంచి 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్వెట్టాకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్వెట్టా సమీపంలో బస్సు అదుపు తప్పి లోయలో పడినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 19 మృతదేహాలను వెలికి తీశారు. బస్సు ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. బస్సు ప్రమాద ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబసభ్యులకు అండగా ఉంటామన్నారు.  



Also read:Ambati on oppositions: వారిని కృష్ణా నదిలో కలుపుతాం..విపక్షాలపై అంబటి మండిపాటు..!


Also read:BJP Vijaya Sankalpa Sabha Live Updates: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కలకలం.. సమావేశ హాల్లోకి తెలంగాణ ఇంటలిజెన్స్ అధికారులు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook