వాట్సాప్ యూజర్లకు ఆ సంస్థ మరో గుడ్ న్యూస్ అందిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అప్‌డేట్ చేస్తున్న వాట్సాప్ ఈసారి మరో అధునాతన సాంకేతికతను తీసుకొస్తోంది. ఈ కోవలోనే ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ సిద్ధమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘స్వైప్ టు రిప్లై’ పేరుతో కొత్త ఫీచర్ రానుంది. ఇప్పటి వరకు మనం వాట్సాప్ మెసేజ్‌కు రిప్లై ఇవ్వాలనుకుంటే దానిపై లాంగ్ ప్రెస్ చేయాలి. అయితే, ఈ స్వైప్ టు రిప్లై ఫీచర్ ద్వారా మనం మెసేజ్‌ను కుడివైపుకు స్వైప్ చేస్తే సరిపోతుందని వాట్సాప్ తెలిపింది. దీని ద్వారా మెసెజ్‌ను కుడివైపునకు స్వైప్‌ చేయడం ద్వారా సులువుగా రిప్లై పంపే వీలుంటుంది.  ఐఓఎస్ యూజర్లకు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఆప్షన్.. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుందని.. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని పేర్కొంది.


అంతేకాదు.. త్వరలోనే యాప్ యూజర్ ఇంటర్ ఫేస్‌లో డార్క్‌ మోడ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్. యూట్యూబ్, ట్విటర్లలో ఇప్పటికే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉండగా.. త్వరలోనే వాట్సాప్‌లో కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. 'డార్క్ మోడ్' ఫీచర్ వల్ల నెట్ బ్రౌజింగ్ చేసే వారికి సౌకర్యంగా ఉంటుంది. చీకట్లో, వెలుతురు తక్కువ ఉన్న చోట్ల ఫోన్ వాడేటప్పుడు కళ్లు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.