AP Road Accident - 3 persons killed: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా ( Prakasam district ) లో మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ( 3 persons killed ) ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. జిల్లాలోని మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు ఫ్లై ఓవర్‌పై లారినీ బైక్ వెనుక నుంచి ఢికొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను బల్లికురవ మండలం వెలమవారిపాలెం పంచాయతీ, కొత్త జమ్మలమడక గ్రామానికి చెందిన కోటయ్య, యేసయ్య, మార్తయ్యగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also read: Kurnool: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు చిన్నారుల మృతి


అయితే ముగ్గురు యువకులు కూడా ( Andhra Pradesh ) ఒంగోలు (Ongole) పట్టణానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మరణించడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. 


Also read; Philippines: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook