భువనేశ్వర్: రైస్ మిల్లు గోడ కూలి నలుగురు మృతి చెందిన ఘటన ఒడిశాలోని డెంకనాల్ జిల్లా అలసువ మార్కెట్‌లో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఒడిశా రాష్ట్ర విపత్తుల నిర్వహణ బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.