విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్‌ ఆదివారం నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్రం విశాఖకు రైల్వేజోన్‌ మంజూరు చేయాలంటూ ఎంపీ ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్‌లో ఆయన తన అనుచరులతో కలిసి దీక్షలో కూర్చున్నారు.


రాష్ట్ర విభజన హామీలు అమలు చేయడంలో కేంద్రం విఫలం కావడం... రైల్వే జోన్‌పై కూడా విముఖత వ్యక్తం చేస్తోందని ఎంపీ మండిపడ్డారు. రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే తీవ్రంగా ఉద్యమిస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛగా ఉన్న రైల్వే జోన్ సాధించే వరకు పోరాటాన్ని  ఆపమని స్పష్టం చేశారు. నిరాహార దీక్షలో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఏప్రిల్ నెలలో 12  గంటల దీక్ష చేపట్టిన విషయం విదితమే..!