ఆంధ్రప్రదేశ్‌లో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా నేటి సెషన్స్ ప్రారంభమయ్యాయి. స్పీకర్ కోడెల శివప్రసాద రావు సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలను స్వీకరించడం మొదలుపెట్టారు. నేటి సమావేశాలలో శాసనసభలో కరువు, డ్వాక్రా రుణాల మాఫీ, ఎన్టీఆర్‌ గృహాల నిర్మాణంపై చర్చ జరుగనుండగా మరోవైపు శాసనమండలిలోనూ ఎన్టీఆర్‌ విద్యోన్నతి, నిరుద్యోగ భృతి, మహిళలపై జరుగుతున్న దాడులు, ఉపాధి కల్పన కేంద్రాలు తదితర అంశాలు చర్చకు రానున్నాయి.