AP Budget: ఆంధ్ర ప్రదేశ్​ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్​పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు చేశారు. పద్దులో ఏ ప్రాంత అభివృద్ధి గురించి ప్రస్తావన లేకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఇదే విషయమై కేంద్ర బడ్జెట్​ విషయంలో సీఎం జగన్ విమర్శలు చేశారని గుర్తు చేసుకున్నారు సోము వీర్రాజు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర బడ్జెట్​ను తప్పుబట్టిన జగన్ రాష్ట్ర బడ్జెట్ విషయంలో ఎందుకు ప్రాంతాల ప్రస్తావన తేలదని విమర్శలు చేశారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం మసి పూసి మారెడు కాయ అన్న చందాన ఉందని చెప్పారు. ఈ బడ్జెట్​ను చూస్తే.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోందన్నారు.


అప్పులు చేసి పథకాలను అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు సోము వీర్రాజు. ఇప్పటికే రాష్ట్రంలో రెవెన్యూ లోటు రూ.5 వేల కోట్లకు చేరిందనే విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. ఈ అప్పులు ఎగ్గొట్టేందుకే ముందస్తు ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తరు చేస్తోందని ఆరోపణలు చేశారు.


నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే.. రాష్ట్ర అప్పులు ఎన్ని అనే విషయంపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు సోము వీర్రాడు. ఈ విషయంపై ఎన్ని సార్లు ప్రశ్నించినా ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువైందన్నారు.


Also read: AP Cabinet Expansion: సస్పెన్స్‌కు తెర.. కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చేసిన సీఎం జగన్...


Also read: Food Poisoning in School: మధ్యాహ్న భోజనం తిన్న 42 మంది విద్యార్థులకు అస్వస్థత!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook