Andhra Pradesh covid-19 cases: అమరావతి: ఏపీలో గత 24 గంటల్లో 93,759 మందికి కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు చేయగా.. వారిలో కొత్తగా 3,464 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 35 మంది కరోనాతో కన్నుమూశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 18,96,818 మందికి చేరింది. కరోనావైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య 12,779 కి పెరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Pregnant women: గర్భిణీలకు కొవిడ్-19 టీకాలు.. అనుమతించిన కేంద్రం


గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4,284 మంది కరోనావైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో కోలుకున్న వారి సంఖ్య 18,46,716 మందికి చేరుకుంది. వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 37,323 యాక్టివ్‌ కేసులు (COVID-19) ఉన్నాయి.


Also read : Disha App: దిశ చట్టంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఏపీ సీఎం YS Jagan లేఖ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook