AP Corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 121 మందికి పాజిటివ్​గా (Corona cases in AP) తేలినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 29,643 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ కేసులు బయపడ్డట్లు వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా ఒకరు మరణించినట్లు ఏపీ (Corona deaths in AP) ఆరోగ్య శాఖ వివరించింది. కృష్ణా జిల్లాలో ఈ మరణం సంభవించినట్లు తెలిపింది.


ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 228 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,597 యాక్టివ్ కరోనా (Corona Active cases in India) కేసులున్నాయిని తెలిపింది.



ఇక ఇప్పటి వరకు మొత్తం 3,09,90,296 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 20,75,804 శాంపిళ్లు పాజిటివ్​గా తెలినట్లు వివరించింది. ఇక ఇప్పటి వరకు 20,59,728 మంది కరోనాను జయించగా.. 14,479 మంది కొవిడ్​కు బలయ్యారు.


మొత్తం కేసుల్లో ఆంధ్ర ప్రదేశ్​కు చెందిన వారితో పాటు.. ఏపీకి వచ్చిన ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల వారు కూడా ఉన్నట్లు వెల్లడిచింది ఆరోగ్య శాఖ.


Also read: Andhra Pradesh: మందుబాబులకు శుభవార్త...ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..


Also read: కాళ్లు, మెడకు తాడు కట్టి-ఛాతిపై వాతలు-పెళ్లయిన నెల రోజులకే నవ వధువు దారుణ హత్య


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook