AP Corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే దాదాపు స్థిరంగా ఉన్నాయి. కొత్తగా 165 మందికి కొవిడ్​ పాజిటివ్​ (Corona cases in AP) వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 24,219 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ కేసులు బయపడ్డట్లు వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా కృష్ణా, నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు ఏపీ (Corona deaths in AP) ఆరోగ్య శాఖ వివరించింది.


ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 130 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ.


ఇక ఇప్పటి వరకు మొత్తం 3,13,82,067 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 20,77,486 శాంపిళ్లు పాజిటివ్​గా తెలినట్లు వివరించింది. మొత్తం 20,61,729 మంది కరోనాను జయించగా.. 14,497 మంది కొవిడ్​కు బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,260 యాక్టివ్ కరోనా (Corona Active cases in India) కేసులున్నాయి. చిత్తూరులో అత్యధికంగా 233 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది ఆరోగ్య విభాగం. 


మొత్తం కేసుల్లో ఆంధ్ర ప్రదేశ్​కు చెందిన వారితో పాటు.. ఏపీకి వచ్చిన ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల వారు కూడా ఉన్నట్లు వెల్లడిచింది ఆరోగ్య శాఖ.


Also read: Vizag RK beach: విహారయాత్రలో విషాదం..ఆర్కే బీచ్‌లో స్నానానికి దిగి ఐదుగురి గల్లంతు..రెండు మృతదేహాలు లభ్యం


Also read: Vaikunta Dwara Darshan: వైకుంఠ ద్వార దర్శనం కోసం సిఫారసు లేఖలు పంపొద్దు: TTD ఛైర్మన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook