Cyclone Alert: ఏపీలో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవహించి ఉంది. అందుకే రానున్న రోజుల్లో వర్ష సూచన జారీ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రానున్న 2-3 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉండటంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంతో పాటు దక్షిణ, ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఇదే ఆవర్తనం అరేబియా సముద్రం నుంచి రాయలసీమ వరకూ వ్యాపించింది. ఈ ప్రభావంతో రానున్న 2-3 రోజుల్లో వర్షాలు పడనున్నాయి. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి. రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. మరోవైపు ఈదురు గాలులు కూడా వీయనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదముందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. 


ఉపరితల ఆవర్తనం కారణంగా దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు భారీ వర్షాలు పడనున్నాయి. రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడవచ్చు. ద్రోణి ప్రభావం ఇలా ఉంటే త్వరలో అరేబియా సముద్రంలో ఒక తుపాను, బంగాళాఖాతంలో రెండు తుపాన్లు ఏర్పడవచ్చని ఐఎండీ హెచ్చరించింది. ఫలితంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఈ నెల 10వ తేదీ తరువాత కోస్తా జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 


Also read: Ys Jagan on Chandrababu: చంద్రబాబూ..ఇక నీవు మారవా, ఎక్స్ సాక్షిగా దుమ్మదులిపేసిన జగన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.