అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి పోటీ లేకపోవడంతో తమ్మినేని సీతారాం ఎన్నిక లాంచనప్రాయమైంది. కొత్తగా స్పీకర్ పదవికి ఎన్నికైన తమ్మినేని సీతారాంకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.


ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్మినేని సీతారాం ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తమ్మినేని.. గతంలో మూడుసార్లు మంత్రిగా పని చేశారు.