2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రానున్న ఎన్నికల్లో తమ పార్టీల తరపున ఏయే నియోజకవర్గం నుంచి ఎవరెవరిని బరిలో దింపితే పార్టీకి ఎక్కువ స్థానాలు గెలుస్తాం, ఏయో నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందనే కోణాల్లో వివిధ రాజకీయ పార్టీల అధినేతలు దృష్టిసారించారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం తమ పార్టీ ఎమ్మె్ల్యేల పనితీరుపై ఓ అధ్యయనం చేయించారట. వివిధ కారణాలతో పార్టీ అభివృద్ధికి కృషి చేయని వారు, ప్రజల మన్ననలు పొందడంలో విఫలమైన వారి జాబితా సిద్ధం చేయించారని, అందులో పేర్లు ఉన్న 40 మంది ఎమ్మెల్యేలకు ఈసారి ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు లేరని తెలుస్తోంది. 


గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్ ఇస్తే, పార్టీకి మేలు జరగడంతోపాటు పని చేయని వారిని దూరం పెట్టారనే మంచి పేరు కూడా సొంతమవుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈమేరకు ది హన్స్ ఇండియా ఓ వార్తా కథనాన్ని సైతం ప్రచురించింది.