అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి బుధవారం నాగార్జునసాగర్‌లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు నాగార్జునసాగర్‌కి చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్‌‌కు తెలంగాణ ప్రభుత్వం తరపున పలువురు మంత్రులు, భారీ నీటి పారుదల శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు స్వాగతం పలకనున్నట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్‌తో పాటు ఏపీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్ కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నారు. 


నాగార్జున సాగర్‌లో పర్యటన అనంతరం మాచర్లలో జరగనున్న జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారు.