సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని ఇవాళ సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకూ హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రజల సందర్శనార్ధం ఉంచనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అక్కడే నివాళులర్పిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు. రేపు ఉదయం గచ్చిబౌలి స్డేడియంలో ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ కృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించనున్నారు. మద్యాహ్నం 12.30 గంటలకు గచ్చిబౌలి స్డేడియం నుంచి పద్మాలయ స్టూడియోస్ వరకూ అంతిమయాత్ర ఉంటుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. 


కృష్ణ మరణవార్త తెలియగానే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. కృష్ణగారు తెలుగువారి సూపర్‌స్టార్. ఆయనే అల్లూరి, ఆయనే జేమ్స్‌బాండ్..నిజ జీవితంలో కూడా మనసున్న మనిిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగువారికి తీరని లోటు అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మహేశ్‌కు, కృష్ణగారి కుటుంబసభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని రిప్లై ట్వీట్ కూడా చేశారు.



Also read: Super Star Krishna Death: మూగవోయిన బుర్రిపాలెం.. సూపర్ స్టార్‌ను గుర్తు చేసుకుంటున్న సొంతూరి ప్రజలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook