అమరావతి: కరోనావైరస్ ( Coronavirus ) నివారణకు చర్యలు చేపడుతూనే ఏపీలో అక్టోబర్ 5 నుండి స్కూల్స్ రీఓపెన్‌ ( schools reopening) చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ( Minister Adimulapu Suresh ) తెలిపారు. మంత్రి సురేష్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్‌లాక్ 5 మార్గదర్శకాలు ( Unlock 5 guidelines ) వచ్చిన అనంతరం కరోనా నివారణకు కేంద్రం విధించే మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలను పునఃప్రారంభించే ఆలోచనలో ఉన్నామని అన్నారు. ఇప్పటికే ఆ దిశగా అధికారులతో సంప్రదింపులు జరుపుతూ చర్యలు చేపడుతున్నామని చెప్పిన మంత్రి ఆదిమూలపు సురేష్.. కేంద్రం నుండి తర్వాతి నిర్ణయం కోసమే వేచిచూస్తున్నామని స్పష్టంచేశారు. Also read : Rhea Chakraborty's bail plea: రియా చక్రవర్తికి షాక్ ఇచ్చిన కోర్టు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ సర్కార్ తరపున విద్యార్థులకు అందించే జగనన్న విద్యా కానుక పథకం ( Jagananna vidya kanuka ) అమలు కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసి పెట్టామని చెప్పిన మంత్రి ఆదిమూలపు సురేష్.. కరోనా తరవాత అన్ని విద్యా సంస్థల్లో సమూల మార్పులు చోటు చేసుకుంటాయని అన్నారు. అందుకే రాబోయే రోజుల్లో పరిస్థితిని ముందుగానే అంచనా వేసి మార్గదర్శకాలు రూపొందించినట్టు మంత్రి వెల్లడించారు. Also read : Director Surya Kiran: బిగ్ బాస్ కంటెస్టెంట్ సూర్యకిరణ్‌ ఎవరో తెలుసా ?


మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR