AP Night Curfew: కరోనా మహమ్మారి పంజా విసురుతుండటంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ సైతం నైట్‌ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1 లక్షా 79 వేల కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా సంక్రమణను దృష్టిలో పెట్టుకుని వివిధ రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ లేదా వీకెండ్ కర్ఫ్యూ లేదా కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ (NIght Curfew) విధించాలని నిర్ణయించింది. కరోనా థర్డ్‌వేవ్ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ విధించింది. 


ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ(Night Curfew)అమల్లో రానుంది. అటు ధియేటర్లు, మాల్స్ కేవలం 50 శాతం ఆక్సుపెన్సీతోనే నడపాల్సి ఉంటుంది. ఇక దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంది. విద్యాసంస్థల మూసివేతపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 


Also read: AP Cinema tickets issue : సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు, వాళ్లకు ఏపీ గుర్తుందా? ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి