AP New Minister: ఏపీ కొత్త కేబినెట్ కొలువుదీరింది. పదవి దక్కినవర్గంలో ఆనందం..దూరమైనవారిలో నిరాశాగ్రహాలు. అభిమానం హద్దు దాటితే మాత్రం ఇదిగో ఇలానే ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుదీర్ఘ కసరత్తులతో కేబినెట్ మార్పులు చేసారు. 11 మంది పాత మంత్రులు, 13 మంది కొత్తముఖాలతో కేబినెట్ సిద్ధం చేశారు. ఈ సందర్భంగా పదవులు కోల్పోయినవారు, ఆశించి భంగపడినవారిలో నిరాశాగ్రహాలు, అసంతృప్తి రేగుతున్నాయి. పార్టీ అధినేత ఆ అసంతృప్తుల్ని బుజ్జగించే పనిలో పడ్డారు.


ఇక మరోవైపు పదవి దక్కినవారిలో మాత్రం ఆనందం తాండవిస్తోంది. అభిమానం హద్దుల దాటి ప్రవహిస్తోంది. డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి అభిమానంతో ముఖ్యమంత్రి జగన్ కాళ్లకు మొక్కగా..మంత్రి పదవి దక్కించుకున్న రోజా జగన్ చేతిని ఆప్యాయంగా ముద్దాడింది. ఇంతవరకూ బాగానే ఉన్నా నూతన కోనసీమ జిల్లాలో మాత్రం అభిమానం రోడ్డెక్కి ప్రవహిస్తోంది. అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ మరోసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడంతో పాటు రవాణాశాఖ మంత్రి కావడంతో ఆ వర్గం ఆనందానికి పరిధుల్లేవు. మంత్రిగా కోనసీమ జిల్లాలో అడుగెడుతున్నప్పుడు భారీగా నోట్లకట్టతో స్వాగతం పలికారు. కరెన్సీ నోట్లు తెచ్చి ఊరేగింపులో రోడ్లపై చల్లుతూ సందడి చేశారు అక్కడి స్థానిక నేత కొమ్ముల కొండలరావు. 


ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. మంత్రి విశ్వరూప్ రాక సందర్భంగా బైక్‌లతో హడావిడి చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తలు అమలాపురం ఈదరపురం వంతెన వద్ద నోట్ల కట్టలు చల్లుతూ స్వాగతం పలికారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 


Also read: Eluru Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు, ఐదుగురి సజీవ దహనం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook