AP Corona Update: కరోనా మహమ్మారి సంక్రమణ తగ్గుముఖం పడుతోంది. వరుసగా రెండవ రోజు కూడా ఏపీలో గణనీయంగా కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో కేవలం 771 కరోనా పాజిటివ్ కేసులే నమోదయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)ఉధృతి నుంచి ఏపీ నెమ్మదిగా కోలుకుంటోంది. గత కొద్దికాలంగా స్థిరంగా ఉన్న కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. వరుసగా రెండవ రోజు కూడా వేయి లోపల కేసులు నమోదైన పరిస్థితి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45 వేల 592 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..కేవలం 771 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు గత 24 గంటల్లో 8 మంది కోవిడ్ కారణంగా మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 14 వేల 150 మంది మృత్యువాత పడ్డారు. 


గత 24 గంటల్లో 1333 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 19 లక్షల 89 వేల 391 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 11 వేల 912 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షల 48 వేల 230కు చేరుకుంది. ఏపీలో ఇప్పటి వరకూ 2 కోట్ల 81 లక్షల 78 వేల 305 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests)చేశారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరులో 153, తూర్పు గోదావరి జిల్లాలో 104, నెల్లూరులో 92, ప్రకాశం జిల్లాలో 83 మందికి కోవిడ్ నిర్ధారణైంది. 


Also read: Badvel Bypoll: బద్వేలు ఉపఎన్నిక వైసీపీ అభ్యర్ధిగా సుధ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook