AP Corona Update: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నుంచి ఆంధ్రప్రదేశ్ క్రమక్రంగా కోలుకుంటోంది. కరోనా వైరస్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నా ప్రతిరోజూ 15 వందల కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 71 వేల 532 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..1601 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణైంది. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 16 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 13 వేల 766 మంది కరోనా కారణంగా మరణించారు. గత 24 గంటల్లో 1201 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 19 లక్షల 78 వేల 364 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 14 లక్షల 61 మంది కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20 లక్షల 6 వేల 191కు చేరుకుంది. ఏపీలో 2 కోట్ల 62 లక్షల 70 వేల 356 కరోనా నిర్ధారణ పరీక్షలు (Covid19 Tests)నిర్వహించారు. 


Also read: PCV Vaccine: ఏపీలో న్యుమోనియో వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook