AP Corona Update: కరోనా మహమ్మారి కేసులు రాష్ట్రంలో తగ్గుముఖం పట్టాయి. కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో 3 వేలకు దిగువనే నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం నైట్ కర్ఫ్యూ మాత్రమే కొనసాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 2 వేల 974 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు 17 మంది కరోనా కారణంగా మరణించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా కారణంగా 13 వేల 132 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24 వేల 708 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. అటు గత 24 గంటల్లో 3 వేల 290 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2 కోట్ల 35 లక్షల 93 వేల 55 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests)నిర్వహించారు. గత కొద్దికాలంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పగటి పూట కర్ఫ్యూని పూర్తిగా తొలగించారు. కేవలం రాత్రి వేళ కర్ఫ్యూ కొనసాగుతోంది.


Also read: AP Government: రాష్ట్రంలో భారీగా ఉక్కు పరిశ్రమలు, క్యూ కడుతున్న కంపెనీలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook