AP Corona Update: ఏపీలో కరోనా వైరస్ ఉధృతి ఇంకా కొనసాగుతోంది. గత కొద్జిరోజులుగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా భారీగా పెంచింది ప్రభుత్వం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)ఉధృతి ఇంకా కొనసాగుతున్నా..కేసుల సంఖ్య మాత్రం క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 82 వేల 297 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా..కేవలం 2 వేల 145 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణైంది. అటు 24 మంది కరోనా కారణంగా మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 13 వేల 468 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో 2 వేలమంది కోవిడ్ నుంచి కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 19 లక్షల 42 వేల 371 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. అటు ప్రస్తుతం రాష్ట్రంలో 20 వేల 302 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో ఇప్పటి వరకూ 19 లక్షల 76 వేల 141 మందికి కరోనా వైరస్ సోకగా..2 కోట్ల 49 లక్షల 46 వేల 265 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) చేశారు. గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 428 కరోనా కేసులు, చిత్తూరులో 369, నెల్లూరులో 304, ప్రకాశం జిల్లాలో 160 మందికి కరోనా వైరస్ సోకింది.


Also read: ఆ కళాశాలలు ఫీజులు వెనక్కి ఇవ్వకపోతే గుర్తింపు రద్దుతో పాటు కఠిన చర్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook