AP Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గత కొద్దిరోజులుగా గణనీయంగా తగ్గుతోంది. కరోనా సంక్రమణ తగ్గే కొద్దీ ఆంక్షల్ని సడలిస్తోంది ప్రభుత్వం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)సృష్టించిన విపత్కర పరిస్థితుల్నించి ఆంధ్రప్రదేశ్ ఇప్పుుడిప్పుడే కోలుకుంటోంది. ఏపీలో గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1217 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20 లక్షల 1 వేయి 255కు చేరుకుంది. మరోవైపు గత 24 గంటల్లో 13 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 13 వేల 715 మంది కరోనాతో మరణించారు. ఏపీలో ప్రస్తుతం 15 వేల 141 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 1535మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 61 వేల 678 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకూ 2 కోట్ల 60 లక్షల 34 వేల 217 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests)నిర్వహించారు. 


Also read: Talibans: ఇండియాకు తరలిస్తుండగా..భారతీయుల కిడ్నాప్, విడిపించేందుకు యత్నాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook