AP Corona Update: కరోనా మహమ్మారి ఏపీలో దాదాపుగా తగ్గుముఖం పట్టింది. గత కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో పాటు రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. కరోనా కేసుల సంఖ్య 3 శాతం వరకే ఉంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఉధృతి ఇప్పుడు ఏపీలో తగ్గుతోంది. గత కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి కన్పిస్తోంది. గత 24 గంటల్లో ఏపీలో 91 వేల 70మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..కేవలం 2 వేల 982 మందికి మాత్రమే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. 3.25 శాతం కేసులే నమోదవుతున్నాయి. అదే సమయంలో రికవరీ రేటు పెరుగుతోంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 28 మంది మరణించగా..రాష్ట్రంలో ఇప్పటి వరకూ 12 వేల 946 కేసులు నమోదయ్యాయి. 


ఏపీలో గత 24 గంటల్లో 3 వేల 461 మంది కోవిడ్ నుంచి కోలుకోగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 18 లక్షల 69 వేల 417 మంది రికవర్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంల 31 వేల 850 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటి వరకూ 19 లక్షల 14 వేల 213కు చేరుకుంది. ఏపీలో ఇప్పటి వరకూ 2 కోట్ల 26 లక్షల 99 వేల 142 కరోనా నిర్ధారణ పరీక్షలు (Covid19 Tests) నిర్వహించారు.


Also read: Navaratnalu: కరోనా కష్టకాలంలో ప్రజల్ని ఆదుకున్నది జగన్ నవరత్నాలే : ఉండవల్లి అరుణ్ కుమార్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook