AP Corona Update: ఏపీలో కరోనా మహమ్మారి సంక్రమణ తగ్గుముఖం పడుతోంది. గత కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అదే సమయంలో  రికవరీ రేటు భారీగా పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గత 15 రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యలో గణనీయంగా తగ్గుదల కన్పిస్తోంది. అటు మరణాల సంఖ్య కూడా తగ్గడం గమనార్హం. గత 24 గంటల్లో 74 వేల 453 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..4 వేల 169 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18 లక్షల 57 వేల 352కు చేరింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 53 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 12 వేల 416 మంది మరణించారు. గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 743, చిత్తూరులో 472, పశ్చిమ గోదావరి జిల్లాలో 659 కేసులు నమోదయ్యాయి. 


రాష్ట్రంలో ఇప్పటి వరకూ 8 వేల 376 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 17 లక్షల 91 వేలమంది రికవర్ అయ్యారు. రాష్ట్రంలో గత కొద్దికాలంగా కరోనా సోకినవారి సంఖ్య కంటే కోలుకున్నవారి సంఖ్య రెట్టింపు ఉంటోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 53 వేల కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో 2 కోట్ల 12 లక్షల 80 వేలమందికి కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) నిర్వహించారు.


Also read: Vamsadhara Tribunal: వంశధార ట్రిబ్యునల్ తీర్పును ఆహ్వానించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook