AP Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింతగా బలపడనుంది. ఫలితంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తూర్పు మధ్య బంగాళాఖాతంలో(Bay of Bengal) తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ఇవాళ రాత్రికి వాయుగుండంగా మారనుంది. రానున్న 48 గంటల్లో వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా ఒడిశా తీరంవైపు పయనించనుంది. వాయుగుండం కాస్తా తుపానుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. ఫలితంగా రానున్న మూడ్రోజులు కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. పశ్చిమ బెంగాల్-ఒడిశా-ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 50-6- కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఇక మత్స్యకారులు వేటకు వెళ్లవద్దంచూ సూచనలు జారీ అయ్యాయి. 


వాయుగుండం కారణంగా రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains)పడనున్నాయి. రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇవాళ కూడా భారీ వర్షాల హెచ్చరిక ఉంది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడవచ్చని తెలుస్తోంది.


Also read: CM Jagan: నిరుద్యోగులకు శుభవార్త....ఏపీ వైద్యారోగ్యశాఖలో 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి