AP weather forecast: అమరావతి: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖపట్టణం వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో శనివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, మరో రెండు రోజుల్లో బంగాళా ఖాతంలో అల్ప పీడనం (Alpapeedanam) మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టంచేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వాయు గుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD reports) అధికారులు తెలిపారు. ఇంకొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. 


Also read : Ganesh chaturthi in AP: ఏపీలో వినాయక చవితి ఉత్సవాలపై AP High court నిర్ణయం


బంగాళాఖాతంలో వాయు గుండం ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, జాలర్లు ఎవ్వరూ మంగళవారం సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఒక దాని ప్రభావం పోకముందే మరొకటి అన్నచందంగా వస్తున్న తుఫాన్లు, భారీ వర్షాలతో (Heavy rainfall in AP) తీర ప్రాంతాల వాసులు తీవ్ర ఆందోళన ఎదుర్కొంటున్నారు. 


Also read : Polavaram Project Update: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఏ దశలో ఉందో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook