అమ‌రావ‌తి: 2018లో జారీ చేసిన నాలుగు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోదని అభ్యర్థులు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్).. తాజాగా ఆయా పరీక్షల తేదీలను సవరించినట్టు ప్రకటించింది. అధిక సంఖ్యలో అభ్యర్థులు వేచిచూస్తున్న గ్రూప్-1 సర్వీసెస్ స్క్రీనింగ్ టెస్ట్ తేదీని 21 రోజుల పాటు పొడిగించినట్టు ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ తెలిపింది. గ్రూప్ 1 సర్వీసెస్‌తోపాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు మెయిన్స్ పరీక్షల తేదీలను, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ పోస్టులకు స్క్రీనింగ్ టెస్టుతో పాటు మెయిన్స్ పరీక్షల తేదీలను కూడా సవరించినట్టు ఏపీపీఎస్సీ అధికారులు స్పష్టంచేశారు. 


మరిన్ని వివరాలకు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగాన్ అవ్వాల్సిందిగా అధికారులు తెలిపారు.