లేపాక్షి ఉత్సవంపై కార్యాచరణ సమీక్ష నిర్వహించే నిమిత్తం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయంలో పలువురు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు సినీనటుడు మరియు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఈ సమావేశంలో భాగంగా ఆయన పర్యాటక, సాంస్కృతిక శాఖల అధికారులతో పాటు రవాణా శాఖ యంత్రాంగం, అనంతపురం జిల్లా ప్రతిప్రతినిధులతో ప్రత్యేక భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశం సందర్భంగా క్యాంపు కార్యాలయంలో సీఎం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీపై బాలయ్య కూర్చుని సమావేశం నిర్వహించడం వివాదాస్పదమైంది. కొందరు టీడీపీ నాయకులు ఇప్పటికే ఈ విషయాన్ని బహిరంగంగా ఖండించారు. బాలయ్య బాబు, చంద్రబాబుకి వియ్యంకుడైతే కావచ్చు గానీ.. సీఎం కోసం కేటాయించిన ఆసనంపై ఆయన కూర్చోవడం మర్యాద కాదని.. బాలయ్య కనీస మర్యాదలు పాటించడంలో కూడా విఫలమయ్యారని ఈ సందర్భంగా ప్రతిపక్షాలు కూడా బాలయ్యను విమర్శించడం గమనార్హం.