అమరావతి: ఐదేళ్ల క్రితం నమోదైన కేసు నుంచి మెగాస్టార్ చిరంజీవికి విముక్తి లభించింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ఆయనపై నమోదైన కేసును ఏపీ హైకోర్టు కొట్టివేసింది.  బుధవారం ఈ కేసు ధర్మాసనం  ముందు విచారణ జరిగింది. చిరంజీవి ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా ఆయనపై అక్రమంగా కేసు బనాయించారని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన ధర్మసనం ఆ కేసును రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు.



2014 ఎన్నికల సమయంలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో  2014 ఏప్రిల్‌ 27న రాత్రి 10 గంటలు దాటిన తరువాత ఎన్నికల ప్రచారం చేశారంటూ గతంలో గుంటూరు అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ చిరంజీవి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది