Swechha: సీఎం జగన్ 'స్వేచ్ఛ' కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా ఈ కార్యక్రమం రూపొందించారు. రుతక్రమ సమస్యలతో చదువులు ఆగిపోతున్నాయని..అందుకే 7 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్ల(sanitary napkins)ను ఈ కార్యక్రమం ద్వారా అందజేస్తామని సీఎం(CM Jagan) తెలిపారు. 10లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా న్యాపికిన్లు పంపిణీ చేస్తామని జగన్‌(CM Jagan) స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్ర వ్యాప్తంగా 10, 388 స్కూళ్లు, కాలేజీల్లో శానిటరీ న్యాప్‌కిన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి నెల జేసీ (ఆసరా) ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరగాలని పేర్కొన్నారు. మహిళా టీచర్లు, ఏఎన్‌ఎంలు బాలికల(Girls)కు అవగాహన కల్పించాలని, ‘స్వేచ్ఛ’ పథకం(Swechha Scheme) అమలుపై నోడల్‌ అధికారిగా మహిళా టీచర్‌ను నియమించామని తెలిపారు. దిశ యాప్‌, దిశ చట్టం గురించి వివరించాలని అన్నారు. మహళా సాధికారతలో ఏపీ మొదటి స్థానంలో ఉందని సీఎం జగన్‌ తెలిపారు. 


Also Read: Ys Jagan Review: రాష్ట్రంలో ప్రతి మహిళ చేతిలో దిశ యాప్ ఉండాల్సిందే


పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వైఎస్సార్‌ చేయూత స్టోర్ల(YSR Cheyutha Stores)లో నాణ్యమైన న్యాప్‌కిన్స్‌ తక్కువ ధరకు విక్రయించేలా చర్యలు చేపట్టింది. యూనిసెఫ్(UNICEF), వాష్, పీ అండ్‌ జీ తదితర సంస్థలతో కలసి అవగాహన తరగతులు నిర్వహించి రుతుక్రమం(Menstruation)పై అపోహలు తొలగించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8న స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలను మహిళా, శిశు సంక్షేమశాఖ పరిధిలోకి తెచ్చింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి స్కూళ్లు, కాలేజీలలో న్యాప్‌కిన్స్‌ పంపిణీకి చర్యలు చేపట్టింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook