అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 72,082 కరోనా శాంపిల్స్ పరీక్షించగా అందులో 4,622 మందికి కరోనావైరస్ ( Coronavirus ) సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,63,573 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 42,855 యాక్టివ్‌ కేసులు ఉండగా మరో 7,14,427 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఏపీలో 35 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో నేటివరకు ఏపీలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6,291 కి చేరింది. Also read : Vijayawada Landslide: ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండ చరియలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ( Health bulletin ) ప్రకారం గత 24 గంటల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 752 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 705 కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 691 కేసులు, ప్రకాశంలో 442, క్రిష్ణాలో 416 కేసులు, గుంటూరులో 391, కడపలో 317, నెల్లూరులో 228, విశాఖపట్నంలో 168, అనంతపురంలో 164, విజయనగరం జిల్లాలో 159,  శ్రీకాకుళంలో 101, కర్నూలులో 88 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 5,715 మంది కరోనా నుండి కోలుకున్నారు. Also read : Bangladesh Ship: విశాఖ తీరానికి కొట్టుకు వచ్చిన భారీ నౌక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe