చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాల్సిందిగా ఇటీవల ఆదేశాలు జారీచేసిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఇదే నియోజకవర్గం పరిధిలోని మరో రెండు పోలింగ్ కేంద్రాల్లోనూ రీపోలింగ్‌ చేపట్టాల్సిందిగా ఆదేశించింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్నకు ఆదేశాలు అందాయని తెలుస్తోంది.


ఇసి ఆదేశాల మేరకు మే 19 ఆదివారం నాటి లోక్ సభ చివరి విడత పోలింగ్‌లో భాగంగానే 310, 323 నెంబర్ పోలింగ్ కేంద్రాలతోపాటు మొత్తం ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.