నారా లోకేష్ బరిలో ఉన్న మంగళగిరి  నియోజకవర్గంలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. వీవీ ప్యాట్లలో తాము ఎవరికి ఓటు వేశారో ఓటర్లకు కనిపించకపోవడంతో వైసీసీ అభ్యర్ధి ఆళ్ల  రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పనితీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఆళ్ల ఆరోపిస్తూ ధర్నాకు దిగారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లోకేష్ కు మేలు చేసేందుకే..


ఈవీఎల మొరాయింపుపై ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ నారా లోకేష్ ను దొడ్డిదారిలో గెలిపించేందుకు చంద్రబాబు ప్లాన్ లో భాగమే ఈ చర్యల అంటూ విమర్శలు సంధించారు. ఇందులో టీడీపీ కుట్ర దాగి ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. లోకేశ్ కు మేలు చేసేందుకు చేస్తున్న కుట్రకు అధికారులు సహకరిస్తున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.