విశాఖపట్నం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి (62) గుండె పోటుకు గురయ్యారు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న తండ్రి పరిస్థితి చూసి తట్టుకోలేక ప్రతిభ స్పృహ తప్పి పడిపోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను అదే ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చేసిన టెస్టుల ఆధారంగా ఆమె గుండె పోటుకు గురయ్యారని వైద్యులు నిర్ధారించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఆమె విశాఖలోని పినాకిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని.. షుగర్‌ లెవల్స్‌ బాగా తగ్గిపోయాయని వైద్యులు పేర్కొన్నారు. తండ్రితో  భారతికి అనుబంధం ఎక్కువని.. ఆయన పరిస్థితి చూసి తట్టుకోలేక ఆందోళనకు గురికావడంతోనే గుండెపోటు వచ్చిందని ఆమె కుమార్తె గ్రీష్మా మీడియాకు తెలిపారు.