గుంటూరులో ఈ రోజు తలపెట్టి జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. పవన్ కల్యాణ్ ప్రసంగాన్ని వినేందుకు భారీగా అభిమానులు తరలిరావడంతో ఈ మేరకు తొక్కిసలాట జరిగింది. అభిమానులు, కార్యకర్తలు బారికేడ్లను తోసుకుంటూ ముందుదూసుకురావడంతో బారీ కేడ్లు ధ్వంసమయ్యాయి. పోటీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఓ కానిస్టేబుల్ తో పాటు పలువురికి గాయాలయ్యాయి. జనాలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ..లాఠీ ఛార్జ్ చేశారు.