ప్రత్యేక హోదా విషయం గురించి పోరాడుతూ.. కేంద్రంపై ఒకవేళ టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. తాను మద్దతిస్తానని.. అయితే ప్యాకేజీ విషయాన్ని పక్కనపెట్టి..కేవలం ప్రత్యేక హోదా నిమిత్తమే నిజాయతీగా పోరాడాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన ఈ మాటలు అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రత్యేక హోదాను టీడీపీ ప్రభుత్వం కేంద్రం వద్ద తాకట్టు పెట్టిందని ఆయన తెలిపారు. ఒకవేళ నిజాయతీగా ప్రత్యేక హోదా గురించి టీడీపీ పోరాటం చేసి.. కేంద్రంపై ఒత్తిడి చేస్తే.. తాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.


వైసీపీ నుండి ఇప్పటికే అయిదుగురు ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని.. టీడీపీ ఎంపీలు కూడా సిద్ధమా.. అని జగన్ ఛాలెంజ్ చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా ముందుకెళ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా.. పార్టీలకు అతీతంగా అందరూ ఒకే తాటిపైకి రావాలని ఆయన తెలిపారు