జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయానికి శనివారం భూమిపూజ చేశారు. పవన్ జిల్లాలో వరుసగా మూడురోజులపాటు పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఉదయం 11 గంటల ప్రాంతంలో జిల్లా పార్టీ కార్యాలయానికి భూమిపూజ నిర్వహించారు. ఇదిలా ఉండగా.. తాను 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి పోటీచేస్తానని అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం విదితమే..!! 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకసారి ఈ జిల్లా సినీ రాజకీయ చరిత్ర విషయానికి వస్తే.. అప్పట్లో హిందూపురం నియోజకవర్గం నుండి గెలుపొంది స్వర్గీయ నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. అలాగే హరికృష్ణ కూడా ఈ నియోజకవర్గం నుండి గెలిచారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎంఎల్ఏగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బిజేపీ అభ్యర్థిగా ఎంపీ స్థానానికి సీనియర్ నటుడు నరేష్ కూడా పోటీలో నిలబడ్డారు. కాగా  పవన్ కళ్యాణ్ ఒకవేళ పోటీ చేసే అవకాశం ఉంటే..అనంతపురం జిల్లాలో ఏ నియోజకవర్గం నుండి పోటీచేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ పవన్ హిందూపురం నుండి పోటీ చేస్తే బాలకృష్ణకి మంచి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని ఇప్పటికే నెటిజన్లు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు చేస్తున్నారు.