జనసేన పార్టీని 2014 మార్చి 14న స్థాపించారు. పార్టీ స్థాపించి ఐదేళ్ల పూర్తి చేసుకుంటున్న సందర్భంగా  ఆవిర్భావ సభను భారీ ఎత్తున నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. ఈ నేపథ్యంలో  ఈ నెల 14న రాజమహేంద్రవరంలో జనసేన ఆవిర్భావ సభను నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది.  కాగా రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆవరణ సభా వేదిక కానుంది. 


అందరూ ఆహ్వానితులే...
సభ నిర్వహణ కోసం పదిహేను మంది సభ్యులతో కూడిన ఓ కమిటీ ఏర్పాటు చేశారు. సభ విజయవంతం చేసే బాధ్యత కమిటీ సభ్యులదే. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే సభకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా జనసే చీఫ్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ సభకు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అందరికీ ఇదే తన ఆహ్వానమని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు