TDP vs YSRCP | అమరావతి: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి, టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానికి మధ్య ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ వార్ జరుగుతోంది ( Vijaya Sai Reddy vs Kesineni Nani). ఒకరి ఆరోపణలకు మరొకరు తిప్పికొడుతూ వరుస ట్వీట్స్‌తో యుద్ధం చేసుకుంటున్నారు. క్వారంటైన్‌లో మ్యాగ్జిమం టైమ్ గడిపిన ఓ పెద్ద బాబు, చిన్న బాబు ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఇలా అర్థం చేసుకున్నారని చెబుతూ.. కొడుకు దేనికీ పనికి రాడని తండ్రి ఓ నిర్దారణకు వస్తే.. తండ్రి ప్రతి విషయంలో తప్పే అని కొడుకు అనుకుంటున్నాడని విజయ సాయి రెడ్డి ట్వీట్‌ చేశారు. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లని ఉద్దేశించి వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలేనని తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. Motor Vehicles: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ )


విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలపై టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్న క్రమంలోనే కేశినేని నాని కూడా విజయసాయి రెడ్డికి అదే ట్విటర్ ద్వారా కౌంటర్ ట్వీట్ చేశారు. విజయసాయి రెడ్డి  ''ఏ1, ఏ2లుగా ఏడాది కాలంపైగా జైల్లో కలిసి ఉన్న మీరిద్దరు ఏం తెలుసుకున్నారు''. జనం సొమ్ము దోచుకోవడానికి మాత్రమే పనికొస్తారని తెలుసుకున్నారా అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు. అంతేకాకుండా మనకేం.. అపాయిట్మెంట్స్ ఇచ్చినట్టే ఇచ్చి రద్దు చేసుకుంటున్నారని కేశినేని నాని ఎద్దేవా చేశారు. ఇరువురు ఎంపీల ట్వీట్స్ కింద వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, టీడీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు రెండు వర్గాలుగా ఏర్పడి ట్వీట్స్, రిట్వీట్స్, కామెంట్స్‌తో తిట్ల దండకం అందుకుంటున్నారు. హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..