YS Jagan Forgot His Mother YS Vijayamma Birthday: సొంత తల్లి జన్మదినాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరచిపోయారు. జన్మనిచ్చిన తల్లిని దూరం చేసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి బర్త్డేకు విష్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే షర్మిలతోపాటు నారా లోకేశ్ విష్ చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
TDP Chief Chandrababu And Ex CM YS Jagan Reacts On Women Reservation Bill Fall: ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో వీగిపోవడం ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఇండి కూటమిపై చంద్రబాబు, వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ మండిపడ్డాయి. వారిపై తాము పోరాడుతానని ప్రకటించారు.
Anna Canteens Expands At Villages: APలో పట్టణ పేదల కడుపునింపుతున్న అన్నా క్యాంటీన్ లు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించనుంది కూటమి సర్కార్. ఈ క్రమంలోనే కొత్తగా 62 క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
AP Delimitation:ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా భౌగోళిక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో చట్టసభల్లో సీట్ల సంఖ్యపెరగబోతున్నాయి. 2026లో తలపెట్టబోతున్న జనగణన, మహిళా రిజర్వేషన్లతోపాటు అసెంబ్లీ నియోజకవర్గాలు, లోక్ సభ నియోజకవర్గాలు గణనీయంగా పెరగబోతున్నాయి. దీంతో ఎవరు లాభపడబోతున్నారే విషయానికొస్తే..
YS Sharmila Fire On Andhra Pradesh MPs: అమరావతి చట్టబద్దత కల్పించే బిల్లుపై చర్చలో ఏపీ ఎంపీలు విభజన హామీలపై ఒక్కరూ మాట్లాడలేదని.. ఇది తెలుగు గడ్డ చేసుకున్న దౌర్భాగ్యం అని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ కాళ్ల దగ్గర ఏపీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
Pithapuram Varma: పిఠాపురం వర్మకు కూటమి సర్కార్ బంపరాఫర్ ప్రకటించిందా..! పిఠాపురంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి భారీ రాయితీలు ప్రకటించిందా..! పవన్ కల్యాణ్ అడ్డాలో తాజ్ హోటల్ నిర్మాణం కోసం 3.4 ఎకరాల భూమిని కేటాయించిందా..! ఈ స్థలంలో దాదాపు 100 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణాన్ని వర్మ చేపడుతున్నారా..! వ్యాపారంలో వర్మ బిజీ.. పవన్ కు తలనొప్పి ఉండదని సీఎం చంద్రబాబు భావిస్తున్నారా..! ఇప్పుడు వర్మకు దక్కిన రాయితీలపై కూటమి పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోందా..!
Janasena MLC Nagababu Minister Post: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో జనసేన నుంచి ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు క్యాబినేట్లో చోటు కల్పించనున్నట్లు సమాచారం. అదే విధంగా టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి దక్కనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
TDP MLA MS Raju Allegations On Ex CM YS Jagan: హిందూ మతాచారాలపై మరోసారి మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా అవమానించారని.. అవహేళన చేశారని టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. తీర్థాన్ని స్వీకరించకుండా కిందకు వేశారని ఆరోపించారు. హిందూచారాలను అవహేళన చేశారని విమర్శించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
These Leaders On Race For Ministry A Head Of AP Cabinet Expansion: ఏపీ కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమైందా..! వచ్చే నెలలో విస్తరించే యోచనలో చంద్రబాబు ఉన్నారా..! ఈసారి మంత్రివర్గ విస్తరణలో భారీ మార్పులకు అవకాశం ఉందా..! ఓ కాపు నేతకు మంత్రి పదవి ఇచ్చే యోచనలో ఉన్నారా..! రేసులో ఎవరెవరు ఉన్నారనేది తెలుసుకుందాం.
Nara Lokesh Chit Chat With Media: తాను క్రికెట్ మ్యాచ్లు చూడడంపై రాజకీయంగా వివాదం రాజుకోవడంతో మరోసారి నారా లోకేశ్ స్పందించారు. అవసరమైతే మాజీ సీఎం వైఎస్ జగన్ను కూడా మ్యాచ్లు చూసేందుకు తీసుకెళ్తానని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తన డబ్బులతోనే వెళ్తున్నట్లు స్పష్టం చేశారు.
Nara Bhuvaneswari Comments: హెరిటేజ్ సంస్థపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై ఆ సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి స్పందించారు. చూసిందే నమ్మండి అంటూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారామ. 33 ఏళ్లుగా ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తున్నామన్నారు. ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం అని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. రూ.4 కోట్లతో చిన్న సంస్థగా తమ ప్రయాణం ప్రారంభించామని, ఇప్పుడు రూ.4 వేల కోట్లకు పైగా విలువైన సంస్థగా ఎదిగాం అన్నారు. నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదన్నారు.
Babu Delhi Tour: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హస్తిన పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై నేడు ఐదుగురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.
Bandla Ganesh Tirumala Yatra Completes: సినీ నిర్మాత బండ్ల గణేష్ తిరుమలకు చేపట్టిన తిరుపతి సంకల్పయాత్ర పూర్తయ్యింది. తెలంగాణలోని షాద్నగర్ నుంచి ప్రారంభించిన యాత్ర తిరుపతిలోని అలిపిరికి చేరుకుంది. అక్కడ బండ్ల గణేశ్కు టీడీపీ, జనసేన పార్టీల నాయకులు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా పేల్చి కండువా కప్పి ఆయన సంకల్ప యాత్రకు మద్దతు తెలిపారు.
Kakinada Rural Janasena MLA: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.
Chandrababu Hot Comments On Tirumala Sanctity: తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు స్పందించి.. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో అనేక దేవాలయాలపై దాడులు జరిగాయని.. తిరుమల పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. పవిత్రతని నిలబెట్టేలా పని చేస్తామని ప్రకటించారు.
AP Politics:ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. రాజకీయాలు గాడి తప్పుతున్నాయి. కీలక నేతలపై చౌకబారు విమర్శలు చేసి రాజకీయాల్లో చెలామణి అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాజకీయాలను అపహాస్యం చేస్తున్నారు. నాయకుల నాలుక తెచ్చిన చేటు.. ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ కు ఏమైంది? ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ అలజడికి కారణమేంటి? నాయకుల్లో తీరుమారదా? ప్రజలు ఏమంటున్నారు?
AP Politics: కాకినాడ జిల్లాలో ఆయనో సీనియర్ ఎమ్మెల్యే..! గత అసెంబ్లీ ఎన్నికల్లో తన వారసుడిని ఎమ్మెల్యే చేయాలని భావించారు..! కానీ వచ్చే ఎన్నికల్లో తన సీటునే కొడుకు కోసం త్యాగం చేయాలని చూస్తున్నారు.! అలాగని ఆయన రిటైర్మెంట్ ప్రకటించలేదు..! వచ్చే ఎన్నికల్లో తాను అసెంబ్లీలోకి అడుగుపెడతానని ప్రకటించారు..! అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నారా..! ఏ ఎమ్మెల్యేకు చెక్ పెట్టబోతున్నారని టెన్షన్ పడుతున్నారా..! మరి ఆయన ఎక్కడి నుంచి పోటీకి రెడీ అవుతున్నారు..!
TG Bharath Visits Tirumala Temple: తిరుమల ఆలయాన్ని ఏపీ మంత్రి టీజీ భరత్ సందర్శించి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయంలో దర్శనానికి వచ్చిన మంత్రి భరత్కు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మంత్రి టీజీ భరత్ మీడియాతో మాట్లాడారు.
AP Assembly Budget Session Likely One Month: బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో నెల రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. సమావేశాలకు హాజరుకాని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉంది.
Perni Nani: వైసీపీ అగ్ర నేత.. మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఇనగుదురుపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.