విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీస్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. రాజేంద్ర(57) కుప్పం పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ (ASI)గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం (జూన్ 3న) సాయంత్రం ఇంటికి వెళ్లాడు. ఏం జరిగిందో తెలియదు కానీ ఉరివేసుకుని బలవన్మరణానికి (ASI Commits Suicide) పాల్పడ్డాడు. సూపర్ ఐడియా.. క్యాబ్‌లో నిశ్చింతగా ప్రయాణం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ సమయంలో రాజేంద్ర కుటుంబం చిత్తూరు పట్టణంలో ఉంది. డ్యూటీ కారణంగా ఆయన ఒక్కరే కుప్పంలో ఉంటున్నారు. అంతకుముందు పెనుమూరు నుంచి 2019 సెప్టెంబర్ లో కుప్పం పీఎస్‌కు బదిలీ మీద వచ్చారు. నడుమూరు చెక్ పోస్ట్ వద్ద డ్యూటీ ఉండగా రాజేంద్ర విదులకు కూడా హాజరుకాలేదని సీఐ బాషా తెలిపారు.  మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్



మంగళవారం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాజేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని కుటుంబసభ్యులు తెఈ మేరకు బుధవారం రాత్రి ఓ పోలీసు వెళ్లి డోర్ కొట్టగా తలుపు తీయలేదు. కిటికీలోంచి చూడగా రాజేంద్ర ఉరివేసుకున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్