తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చట్టి జంక్షన్ వద్ద విషాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ లారీ రోడ్డుపక్కనే వున్న ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందగా మరో ఇద్దరు ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చింతూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. 


లారీ బీభత్సం సృష్టించిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.