IMD:వేసవిని తలపించే ఎండలతో విలవిల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలగనుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఫలితంగా ఏపీలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దికాలంగా ఎండలు దంచి కొడుతున్నాయి.వేసవిని తలపించే ఎండలతో ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. పశ్చిమ దిశ నుంచి కోస్తాంధ్ర మీదుగా గాలులు వీస్తుండటంతో కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.ఈ నేపధ్యంలో త్వరలో ఎండల నుంచి ఉపశమనం కలగనుంది. ఈ నెల 12న బంగాళాఖాతంలో(Bay of Bengal) అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.ఈ అల్పపీడనం క్రమంగా మచిలీపట్నం, గుంటూరు మీదుగా రాష్ట్రంలో ప్రవేశించే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఫలితంగా ఇవాళ్టి నుంచి కోస్తా, రాయలసీమల్లో అడపాదడపా వర్షాలు కురిసే సూచనలున్నాయని ఐఎండీ(IMD)వర్గాలు పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీ తరువాత వర్షాలు ఊపందుకున్నాయి. గత 24 గంటల్లో రాయలసీమల్లో 1-2 చోట్ల దక్షిణ కోస్తాలో వర్షాలు(Heavy Rains) కురిశాయి.


Also read: ఏపీలో త్వరలో ప్రారంభం కానున్న న్యుమోనియా వ్యాక్సినేషన్ కార్యక్రమం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook