AP Corona Update: కరోనా మహమ్మారి నియంత్రణకై చేపడుతున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. కట్టుదిట్టమైన కర్ప్యూ, భారీగా చేపడుతున్న నిర్దారణ పరీక్షలతో ఏపీలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ( Corona Pandemic) తగ్గుముఖం పడుతోంది. గత కొద్దిరోజుల్నించి పోల్చితే కేసుల సంఖ్యలో గణనీయంగా తగ్గుదల కన్పించింది. రోజుకు 18 గంటల కట్టుదిట్టమైన కర్ఫ్యూ, ఈ పాస్ విధానం, భారీ ఎత్తున నిర్వహిస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షలతో ఏపీలో కరోనా కేసుల(Ap Corona Cases) సంఖ్య భారీగా తగ్గుతోంది. నిన్న మొన్నటి వరకూ రోజుకు 20 వేల వరకూ నమోదైన కేసులు..ఇప్పుడు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో 83 వేల 461 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..కేవలం 7 వేల 943 కేసులు వెలుగు చూశాయి.


మరోవైపు గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా కారణంగా 98 మంది మరణించారు. మొత్తం రాష్ట్రంలో మరణించివారి సంఖ్య 10 వేల 930కు చేరుకుంది. మరోవైపు 19 వేల 845 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 15 లక్షల 28 వేల 360 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్పటి వరకూ 1 కోటి 92 లక్షల 56 వేల 304 కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1 లక్షా 53 వేల 795 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1877 కేసులు, చిత్తూరులో 1283, గుంటూరులో 765 కేసులు నమోదయ్యాయి.


Also read: AP Curfew: ఏపీలో కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook